త్రినాథస్వామి వ్రత కథ..

Thrinadha Swami Vratha Katha : భక్తులారా! మనస్సు నిర్మలంతో వినండి. ఈ త్రినాధుల చరిత్రము మాటి మాటికి వినుటకు అమృతమువలె యుండును. శ్రీపురము అను గ్రామంలో మధుసూదనుడను ఒక బ్రాహ్మణుడుండెడివాడు. అతడు మిక్కిలి దరిద్రుడగుటచే బిక్ష మెత్తుకుని జీవించేవాడు. ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించెను. ఆ తల్లికి పాలు చాలనందున అ బాలుని శరీరము దిన దినము కృశించుచున్నది. ఆ బాలుడు చిక్కి పోవుచున్నందున ఆ బ్రాహ్మణుని భార్య పెనిమిటితో నిట్లు పలికెను. “అయ్యా ! నేను చెప్పెడి మాట శ్రద్దగా వినండి. మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలు గల ఆవు నొకటి తీసుకోండి ” అని చెప్పగా ఆ మాట విని భర్త యేమని చెప్పుచున్నాడంటే – “ఓసీ నీకు వెర్రి పట్టినదా ? మనము చూడగా కడు బీదవారము, పాలు ఇచ్చే ఆవు ఏలాగున దొరుకుతుంది ? ధన రత్నములు మన వద్ద లేవు.

త్రినాథస్వామి వ్రత కథ..

నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను ? ఎవరికైతే ధన సంపదలు కలిగి యుండునో, వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది. అట్టి వారికే లోకమంతా భయపడతారు. మనవంటి బీదవారిని ఎవరు అడగుతారు” అని బ్రాహ్మణుడు చెప్పెను. భార్య మిగుల దుఃఖించినదై, ఓ బ్రహ్మ దేవుడా ! నీవు మా వంటి బీద వారింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు ? ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు ? ఈ శిశు హత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా పిల్లవాని ఘోష చూసి ఏమియు తోచక ఆ బ్రాహ్మణుడు చింతా క్రాంతుడై విచారించి, తన ఇంటిలో ఉండిన కమండలం వగైరా చిల్లర సామానులు సంతలో అమ్మి, ఆ వచ్చిన సొమ్ము అయిదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్లి భార్య చేతికి ఇవ్వగా, ఆమె ఆ సొమ్ము చూచి సంతోషించి, పెనిమిటిని చూచి – అయ్యా ! ఈ సొమ్మును తీసుకువెళ్లి పాలు ఇచ్చే ఆవును కొని తీసుకురండని చెప్పినది.

అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారము బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకుని గ్రామ గ్రామం తిరిగెను. ఇట్లు తిరుగుచూ, పెద్ద భాగ్య వంతుడగు షావుకారు ఉండే గ్రామమునకు వెళ్ళెను. ధన ధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరి సమానముగా ఉన్నాడు. అతని ఆవులన్నియు పాలతో నిండియున్నవి. దైవ ఘటన మాత్రం మరో విధముగా యున్నది. తన ఆవులలో ‘భోదా’ అనే ఆవు ఉండెను. అది మిగుల దుష్ట బుద్ధి గలది. బైటకు మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తినివేస్తుంది. ఒక దినమున షావుకారు చూస్తుండగానే పేదవాడి పొలంలోకి చొరబడి పండిన పంటను తిని వేయుచుండెను.

Thrinadha Swami Vratha Katha 

అది చూచి షావుకారు అతి కోపంతో యేమనుచున్నాడంటే “ఇక దీని ముఖము చూడకూడదు. అవును ఇప్పుడే అమ్మివేస్తాను. ఇది 50 రూపాయలు అయినప్పటికీ నాకు మంజూరు లేదు కాబట్టి ఇప్పుడు బేరం వచ్చినచో ఐదు రూపాయలకే ఇచ్చి వేస్తాను” అనేసరికి మధుసూదనుడు ఆ మాటలు విని షావుకారుతో యిట్లనెను. “షావుకారూ! వినండి 50 రూపాయలు ఖరీదుగల ఆవు అయినప్పటికీ మీకు మంజూరు లేదు కావున ఆ ఐదు రూపాయలు నేనే ఇస్తాను. ఆవూ,దూడా రెండిటిని నాకు ఇప్పించండి” అని అనగానే “ఓ బ్రాహ్మణుడా! నీకు వెర్రి పట్టినదా” అని షావుకారు అనెను. అంత బ్రాహ్మణుడు “మీరు షావుకార్లు అయి ఉన్నారు మీ మాట మీరు నిలుపుకోండి. మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు” అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని, తన మదిలో విచారించి “తెలియక అనివేసినాను. ఈ బ్రాహ్మణుడు ఎక్కడ నుండి వింటున్నాడో, ఈ ఆవును అతనికివ్వకపోతే నాకు అసత్యము ప్రాప్తించును కదా!” అని బ్రాహ్మణుని చూచి చెయ్యి చాచాడు. వెంటనే సొమ్ము పుచ్చుకుని ఆవును, దూడను బ్రాహ్మణునకు షావుకారు ఇచ్చి వేసినాడు. ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూచిన కలువవలె సంతోషపడెను. వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందము పొందినది. ఇట్లు కొన్ని దినములు గడచిన తరువాత ఆవు ఎటు పోయినదో కనిపించలేదు. ప్రొద్దు పోయెడి వేళయినది ఆవు రాకపోవడము చూచి బ్రాహ్మణుడు వెదక బోయినాడు. వీధుల్లోనూ, సమీపమున ఉన్న వ్యవసాయ భూముల్లోను చూచెను. ఆవు కనిపించలేదు. తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెదుకుటకై బయలుదేరి కొంత దూరము నడచి వెళ్లి తోటలో ఒక చెట్టును చూచాడు.

అది ఒక గొప్ప మర్రి చెట్టు, పైన ముగ్గురు మనుష్యులు కూర్చుని ఉన్నారు. వారు వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకుని, లేచి పోవుచుండగా, త్రిమూర్తులు బ్రాహ్మణునితో ‘ఓ విప్రుడా! నీ మనస్సుకు ఎందుచేత దుఃఖము కలిగినది ? నీవు ఎక్కడికి వెళ్లుచున్నావు ? ఆ సంగతి మాతో చెప్పు” అని అనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి “అయ్యా ! నేను కడు బీదవాడను, బిక్ష మెత్తుకుని బ్రతికే వాడను, నాకు ఒక ఆవు ఉన్నది. అది కనిపించట్లేదు ఈ దినము శ్రీ పురము సంత అగుచున్నది. ఆ సంతకు వెళ్లి వెతికెదను. ఎవరైనా దొంగిలించి తీసుకొని పోయినట్లయితే ఆ సంత లోనే అమ్ముతారు గదా ! త్రినాధ స్వాములారా ! ఈ ఉద్దేశ్యముతోనే నేను వెతుక్కుంటూ వెళ్ళుచున్నాను.” అని తన సంగతి చెప్పెను.

కార్తీక పౌర్ణమి విశిష్టత..

అది విని బ్రాహ్మణునకు త్రిమూర్తులు యేమి చెప్పుచున్నారంటే “నీ వేలాగూ సంతకు వెళ్లుచున్నావు కనుక, మా నిమిత్తము ఏమన్నా కొన్ని దినుసులు తీసుకురావలెను” అని త్రిమూర్తులు అన్నారు. అంత బ్రాహ్మణుడు “యేమి దినుసులు కావాలని అడుగగా త్రిమూర్తులు యిట్లనిరి. ఒక్క పైసా ఆకుచెక్క, ఒక్క పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పిరి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు యేమని చెప్పు చున్నాడంటే ” ఓ త్రిమూర్తులారా ! నాకు పైసాలు ఎక్కడ దొరుకును ? నేను బీదవాడను గదా ? బిక్ష మెత్తుకుని జీవించు చున్నాను.” అని అనగా, త్రిమూర్తులు యేమి చెప్పు చున్నారంటే “ఓ బ్రాహ్మణుడా ! విను, అదిగో రెల్లి పొద కనిపించు చున్నది కదా ! దాని మొదట మూడు పైసాలున్నవి” ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్లి ఆ గోరంటు గడ్డి మొదలు పైకి లాగే సరికి మూడు పైసాలు దొరికినవి. ఇంకా ఉండునేమోనని ఆ చెట్టు నింకను పైకి లాగుచుండెను అది చూచి త్రినాదులవారు “బ్రాహ్మణుడా ! నీకు వెర్రి పుట్టినదా ? అందులో పైసలు ఇంకా లేవు. ఎంత దొరికినదో అంతే యుండును” అని అన్నారు ఆ మాటలు బ్రాహ్మణుడు విని, అచ్చట నుండి వెళ్ళిపోయెను. కొంత దూరం వెళ్లి తిరిగివచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించగా త్రినాదులు ఇట్లు పలికిరి.

“ఓ విప్రుడా ! తిరిగి ఎందుకొచ్చావు” అనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగున తెస్తాను అని ప్రశ్నించగా నీపై మీద గావంచాలో తెమ్మని త్రినాదులన్నారు. అందులకా బ్రాహ్మణుడు గావంచాలో నూనె ఎలా ఉంటుంది ? మీరు జగత్కర్తలు, నాతో కపటంగా చెబుతున్నారు అనగా “ఓయీ ! నీతో కపటంగా చెప్పలేదు. మమ్ము తలుచుకుని నూనె గావంచాలో పోసి తీసుకురమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీ పురం సంతలో ప్రవేశించినాడు. వెళ్లి చూడగా ఆవు కనిపించ లేదు.

 

ఆకులు, వక్కలు, గంజాయి తీసుకుని, నూనె కోసం బజారుకెళ్ళి తెలికల వానితో “ఒక్క పైసా నూనె గావంచలో పోయమన్నాడు అందులకా తెలికలవాడు ఆశ్చర్య పడి , “ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదు. అని చెప్పినాడు. అక్కడ నుండి వెళ్లి ఒక ముసలి తెలికలవానిని నూనె అడిగినాడు అంత ముసలివాడు “దిగుమట్టు నూనె ఎంతటిది కావాలని అడుగగా ఒక్క పైసా నూనె మాత్రమిమ్మని బ్రాహ్మణుడు గావంచా చూపినాడు తెలికలవాడు “ఈ బ్రాహ్మణుడు వికారపువాడు కాబోలు ! వీనిని మోసము చేసి పైసాలు తీసుకుంటాను” అని ఆలోచించి కొలత పాత్ర తిరగ వేసి నూనె కొలత వేసి ఇచ్చాడు. విప్రుడు గావంచా కొన చెంగు పట్టుకొని అచట నుండి వెడలిపోయెను. అంతియే, తెలికలవాని కుండలో నూనె కొంచమైననూ లేకుండా పోయింది. అది చూచి తెలికలవాడు మూర్చపోయినాడు. తెలికల వాళ్ళందరూ పరిగెత్తు కొచ్చి ముసలివాని ముఖముపై నీళ్ళు చల్లి, సేదతీర్చి కూర్చుండ బెట్టినారు. ఏమి చెప్పుదను ? ఎక్కడ నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు. ఇప్పుడిట్లు వెళ్ళినాడు కుండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించారు. ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్ముకూడా నూనె అడిగినాడు లేదనిఅనగా వెళ్ళిపొయినాడు. ఈ లాగున అందరూ విచారించి పరుగెత్తుకొని విప్రుని వద్దకు వెళ్లి ఇలా అన్నారు. “విప్రుడా ! విను మీరు నూనె కొన్నారు కదా ! అది కొలతకు తక్కువగా యున్నది పూర్తిగా ఇచ్చివేస్తాము పట్టుకుని వెళ్ళండి” అన్నారు. మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళాడు ఈసారి, ముందు తెచ్చిన దుత్త తోనే చమురు సరిగా కొలవగా ఎప్పటివలెనే దుత్త భర్తీ అయిపోయినది . అది చూచి ముసలి తెలికలవాని ఆనందము చెప్పనలవి కాపోయింది. విప్రుని గావంచాలో చమురు ఉంచారు. అది పట్టుకుని విప్రుడు వెడలిపోయినాడు. త్రిమూర్తుల వారికి పై సామానులు ఇచ్చివేసి శలవు అడిగినాడు.

Thrinadha Swami Vratha Katha 

సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే “ఓయీ ! నీ కష్టము చూచి మా మదిలో దయ కలిగినది .ఒక మాట విను .నీవు త్రినాధుల సేవ చేసేదవేని నీ దరిద్రము పటా పంచలై అధిక సంపదలు కల్గునని త్రినాధులనగా అది విని “స్వామీ ! ఏయే వస్తువులతో మిమ్ములను పూజ చేయవలెననగా త్రినాధులు ఇలాగన్నారు . ‘ఓ ద్విజుడా ! వినుము. మా పూజకు అధిక ద్రవ్యము అక్కరలేదు కొంచెము తోనే తృప్తి పొందుదుము. ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసల సామాగ్రి చాలును. త్రిమూర్తుల పూజా ద్రవ్యములు ఇంతే. మాకు వీనితోనే మేళా చేయుము. మూడు మట్టి చిలుమల యందు గంజాయి నలిపి, అందులో నిప్పుతో ధూపము వేయవలెను. దీప ప్రమిదలు మూడు చేసి అందులో చమురు వేసి, వత్తులు వేసి, ఆకుచెక్కలు జాగ్రత్త చేసి ఉంచి, రాత్రి తొలి జాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్ధములను స్వాములకు సమర్పించవలెను. అలాగున చేసిన సకల పాపములు నివారించును.” అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించెను. చెట్టు మొదటనే పూజ ఆరంబించి, గంజాయి ముందు తయారు పరచాడు. అప్పుడు త్రిమూర్తులు “నీ గావంచా చెంగు చీరి వత్తులు చేయమనగా ద్విజుడు చెప్పుచున్నాడు, నేను బీద బ్రాహ్మణుడను బిక్ష మెత్తుకుని దినమును గడుపుకొని కుటుంబ పోషణ చేసుకొనుచున్నాను. అన్న వస్త్రములకు బహు కష్ట పడుచున్నాను, దీపము ముట్టించుటకు అగ్గి లేదు నాగావంచా వత్తులకు ప్రాప్తమైనది నా ఆవు దొంగలపాలైనది. నా కుటుంబము ఉపవాసముతో ఎదురు చూస్తుంటారు ఏ బుద్దితో పూజ చేస్తాను ? అని ఏవగించుకుని ద్విజుడు కూర్చున్నాడు. అది చూచి త్రిమూర్తులు “ఓ ద్విజుడా ! మదిలో చింత పడకు నీ ఆవు పెయ్యా దొరుకుతాయి. నీవు నీ కుటుంబము, సౌఖ్యముగా ఉంటారు.

వస్త్రములు కూడా దొరుకునని చెప్పినారు. అంతట బ్రాహ్మణుడు చేతులు జోడించి ” స్వాములారా ! అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేళాలు స్వామి వారికి ఇస్తాను. ఈ మాట సత్యమని చెప్పినాడు. దీపము వెలిగించుటకు అగ్గి లేదే ! నేను ఏమి చేయగలను ? అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు “ఓ బ్రాహ్మణుడా ! నీ రెండు నేత్రములు మూసుకో” వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపము వెలిగినది. అది చూచి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించాడు. మేళా ఇచ్చి వేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి, సాష్టాంగదండ మొనరించాడు.

త్రిమూర్తుల వద్ద శలవు పొంది కొంచెము దూరము నడచి వెళ్ళు చుండగా త్రోవలో ఆవును, దూడను చూసి సంతోషించి ” త్రినాదులవారు నాయందు దయ ఉంచి ఆవును ,పెయ్యను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగుగా చేసినాను” అని భావించుకొని ఆవును దూడను తోలుకొని పోయి ఇంటికి చేరినాడు. చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా యున్నవి అది చూసి అధికముగా సంతోషము పొంది, కడు శ్రద్ధతో పూజ నర్పించాడు. చేయ వలసిన కార్యక్రమముల నందరికీ విశదముగా తెలియ పరచాడు. తన స్నేహితులను రప్పించి వెనుకటి వలెనే మేళా సమర్పించాడు. మేళా చేయు పద్ధతిని అందరికి చెప్పగా అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యములో ఉన్న ప్రజలందరూ త్రినాధ పూజ చేసారు. అందరి ఇండ్ల యందు సుఖ సంతోషములు నిండెను. దానివల్ల షావుకార్లు అందరూ వ్యాపారములు మూసివేసినారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసారు .

వారిని చూచి రాజు “మీరందరూ యెందుకు వచ్చినారు ? అని అడుగగా “అయ్యా మా ఫిర్యాదు మీరు వినవలయును మధుసూదనుడను పేద బ్రాహ్మణుడు ఒకడు బిక్ష మెత్తుకుని జీవించెడివాడు శ్రీపురము వెళ్లి వచ్చి త్రినాధ మేళాను ఆచరించినాడు. త్రినాదులు యే దేవతలో ? వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి. ఊరిలోనున్న రైతులు యావన్మంది త్రినాధ మేళా చేసినారు గ్రుడ్డివారు, కుంటివారు, అందరూ కూడా ఈ మేళాను చేసినారు. అందరూ మోక్షమంది నారు. ధన ధాన్యాలు కలిగి కుబేరునితో సమానమై పోయినారు. మా వ్యాపారములు పోయినవి మా క్రయ విక్రయములు ఏలాగున జరుగుతాయి !” అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపము తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపముతో ఇట్లన్నాడు.

“త్రినాదులు అనే దేవతలు యేమి దేవతలు ? వారిని మీరు యెందుకు పూజించు చున్నారు ? నేను చెప్పుచున్నాను వినండి ఆ పూజ మీరు చేయకూడదు అట్లు పూజ ఎవరు చేస్తారో వారు ఐదు వందల రూపాయలు జరిమానా ఇచ్చి ఆరు మాసములు ఖైదులో ఉండవలసింది. అటుల కాని యెడల శూలం వేయబడునని రాజు గారు ప్రజలందరికి తాఖీదు ఇచ్చి పంపినారు.

ఈ సంగతి త్రినాధుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించి నారు. దాని ఫలితముగా రాజకుమారుడు చనిపోయినాడు నగరంలో ఏడ్పు ఘోష వినిపించు చున్నది .ప్రజలందరూ రాజు వద్దకు పరుగెత్తినారు .రాజు దైవ కృప, తప్పడం వలన తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నాడు కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చు చున్నాడు. తల్లి, బంధువులు మొదలగు వారంతా దుఃఖించు చున్నారు. దహనము చేయుటకై స్వర్ణభద్రా నదీ తీరమందు ఆ శవము నుంచినారు.

కేదారేశ్వర వ్రతం..

త్రినాదులకు దయ కలిగినది “రాజ కుమారుని బ్రతికించి వెతుమా ! మనకు పేరు ప్రఖ్యాతులు కలుగును.” అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానమునకు వచ్చారు. రాజును వారి సమూహమును చూసి “మీరందరూ ఈ నదీ తీరమునకు యెందుల కొచ్చినారు ? ఏల విచారముగా కూర్చున్నారు. ఈ పిల్లవాడు ఎందుకు పండుకొని యున్నాడు ? ఇతని శరీరములో చల్లదనము కలదే ? అని అడుగగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు. “మీతో ఏమి చెప్పగలం రాజకుమారుడు చనిపోయినాడు ఆ రాజేమి దోషము చేసెనో కాని ఈతడు చనిపోయినాడు. ” అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు త్రినాధుల వారికి రాజు అపరాధము చేసినందు న ఈ చావు కలిగినది. ఇప్పుడు మీరందరూ త్రినాధులను భజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మా మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రినాధ మూర్తులు అదృశ్యులైనారు. అందరూ వారి మాటలను విని త్రినాధ స్వాముల పేరు ఆ రాజ తనయుని చెవిలో చెప్పినారు. ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూచి అందరును సంతోషమును పొందినారు. అప్పుడు త్రిమూర్తుల పేరు మాటి మాటికి స్మరించారు. అందరి నోటినుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినవి .

అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ వూరి మీదుగా తన ఓడలలో విదేశములకు సరుకులను తీసుకు వెళ్ళు చుండెను. ఆ ఓడను నడిపించుకొని స్వర్ణభద్రా నది తీరమున ప్రవేశించాడు. ఘోష చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు. వారిని చూచి జనులారా ! త్రినాధుల పేర్లు యేమి పేర్లు ? మీరేల స్మరించు చున్నారు ? వినడానికి శ్రద్ధగా ఉన్నాయి. అనగా రాజుగారి మనుష్యులు ఇట్లన్నారు. ఓ వర్తకుడా ! వినుము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేవారు త్రినాధ స్వాములు అటువంటి ప్రభువులను మా రాజు గారు మన్నించ నందున అపరాదుడైనాడు . ఆ అపరాధము వలన ఈ రాజకుమారుడు చనిపోవుట చే ఇతనిని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారము చేయుటకు కూర్చుని యున్నాము. ఇది చూచి ప్రభువులకు దయకలిగినది వచ్చి వీనిని బ్రతికించి నారు. అందుకు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను.

ఈ విధంగా వారు చెప్పగా విని, షావుకారు మదిలో సంతోషించి అటువంటి ప్రభువు లేక్కడుందురో ? చనిపోయిన రాకుమారుడు బ్రతికి కూర్చుండెను .నా ఓడలు ఒడ్డున ఆనుకొని యున్నవి నేను ఈ ఒడపై వెళ్లి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకున్నట్లు అయితే. నాకు వ్యాపారంలో నష్టము రాక పోయినట్లయిన ప్రభువులవారికి ఐదు మేళాలు చేస్తాను. ఇట్లు మనస్సులో సంకల్పించుకొని ఓడపై కూర్చుని నడిపించుకొని వెళ్ళిపొయినాడు. పైదేశము వెళ్లి అచ్చట గొప్ప లాభము పొంది తిరిగి వచ్చి ఓడ నడిబొడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు.

తన నౌకర్లందరూ ఓడ లోని ధనము మోసుకొని పోయినారు.ధనమును ఇంటిలో వేసుకుని షావుకారు సంతోషముతో ఉన్నాడు. ధనం చూచి ప్రభువులవారి మేళాలు మరిచెను . అందుకు ప్రభువులకు కోపము కలిగి దండన వేసినారు ఓడ నీటిలో మునిగిపోయినది . నౌకర్లు, ఓడలో నున్న వారందరూ నీటిలో మునిగి పోయిరి .అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు. మరి కొంత సేపటికి తెలివి తెచ్చుకుని ఏడ్చు చుండగా ఆకాశములో నుండి త్రినాధులు నీవు మాకు మేళాలు ఇచ్చినావు కావు. అందుచేతనే ఓడ మునిగినది . నీవు ఐదు మేళాలు సమర్పించి నట్లయిన నీ ఓడ నీకు ప్రాప్తించును. అని సెలవిచ్చారు అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పము చేసియుంటిని ప్రభువుల మహిమను మరచితిని ఇప్పుడే త్రినాదులవారికి మేళా ఇస్తాను. అని మదిలో నిశ్చయించుకొని మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువులవారికి మేళా సమర్పించి ప్రార్థించాడు .నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది .అదిచూచి పట్టలేని సంతోషము పొందెను పరిచారకలు నౌకర్లు, ఓడలో గల మిగిలిన ధనము కొని పోయినారు. ధనము మోయించి షావుకారు ఇంటిలో ప్రవేశించెను.గంజాయి ఆకులు, చెక్కలు అన్నీ స్వామి వారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామంబులు చేసారు .రాజ్యమంతా త్రినాధ స్వామి మేళా గురించి ప్రకటనలు పంపించి నారు.మేళాను చూచుటకు అంతా వస్తున్నారు .

ఇట్టి స్థితిలో గ్రుడ్డివాడొకడు త్రోవను బోయే వారితో అన్నా మీరెవరు మీపేరేమిటి ? మీరెక్కడకు వెళ్ళు చున్నారు ? అనెను వారు మేళా చూచుట కనిరి .అది విని గ్రుడ్డి వారు నాకు కండ్లు కానరావు .మీరందరూ నేత్రములతో చూస్తారు .నేను దేనితో చూస్తాను. అని అనగా గ్రుడ్డివాడా ! త్రినాధ స్వామీ వారిని భజింపుము నీ కన్నులు బాగుగా కనపడును. ప్రభువుల వారి మహిమ చూడ వచ్చును. అని చెప్పి, వారంతా మేళా వద్దకు ప్రవేశించారు. గ్రుడ్డి వాడు ఆ త్రోవలో కూర్చుని స్వామివారి భజన చేయుచుండగా కొంచెము కన్నులు కన్పించినవి. అప్పుడు గ్రుడ్డివాడు కొంత దూరము పోయినాడు. దారిలో ఒక సొట్టవాడు కూర్చుని యున్నాడు. వానిని చూసి నీవు గ్రుడ్డి వాడవు ఇంత కష్టంతో ఎక్కడకు వెళ్లుచున్నావు అని అడిగినాడు. గ్రుడ్డివాడు చెప్పుచున్నాడు .అన్నా ! నేను మేళాను చూచుటకు వెళ్ళు చున్నాను ఆ మాటలు సొట్టవాడు విని ” స్వామి వారి దయ నా మీద లేదు .చేతులు ,కాళ్ళు ,సొట్ట ,నేనెలాగున నడువగలను? నీకు కాళ్ళున్నవి దేక్కుని వెళ్ళగలవు , అంత గ్రుడ్డివాడు చెప్పు చున్నాడు ” నీవు త్రినాధ స్వామి వారిని భజింపుము .నీ కాళ్ళు చేతులు బాగౌతవి .క్షణంలో ఇద్దరం కలసి వెడలిపోదాము.నేను కేవలం గ్రుడ్డివాడిని ఎ మాత్రం కన్నులు కనిపించుటలేదు .త్రినాధ స్వామి వారిని భజించినాను కనుక, కొంచెము కనిపిస్తున్నది .అందుచే, నీవు కూడా స్వామివారిని భజించినావంటే నీ బాధలు నివారణ చేస్తారు . అని చెప్పగా సొట్టవాడు త్రినాధా! త్రినాధా ! అని భజించాడు..గ్రుడ్డి అన్నా ! నీకు కాళ్ళున్నవి, నడవ గలవు, నేను ఎలాగు నడవ గలను .నన్ను నీ భుజము మీద కూర్చో బెట్టుకొన నెమ్మదిగా నడచి వెళ్ళు నేను త్రోవ చూపుతుంటాను. నిశ్చింతగా ఇద్దరమూ మేళాకు చేరుకుందాము. అని పొట్టవాడు చెప్పాడు. అతని మాటలు విని గ్రుడ్డివాడు పొట్టవానిని భుజముపై కూర్చో బెట్టుకుని మెల్లగా నడచి పోతున్నాడు.నేస్తం ! నా నేత్రాలు నిర్మలంగా కనిపించు చున్నవి అని అనగా సొట్టవాడు అయ్యా ఇప్పుడు నడచి పోగలను ఈ విధంగా గ్రుడ్డివాడు, సోట్టవాడు కలసి త్రినాధ స్వామి మేళా దగ్గరకు ప్రవేశించి నారు .

ఆ మేళా జరుగు స్థలమునకు నిత్యమూ ఒక వైష్ణవుడు వస్తూ ఉండెడివాడు .అతడు త్రినాధ మేళా చెల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు.అతనిని ఈ ప్రొద్దు మన స్థాన మందు కూర్చుండ బెట్ట వద్దు అని అనుకుని మేళా చేయు వారంతా వైష్ణవుడు రాగానే చూచి మేళా చెల్లించ కుండా నీవు వెళ్ళు చున్నావు. కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపు చేయడమైనది .అని చెప్పగా వైష్ణవు డేమి అంటున్నాడనగా నాయనలారా ! అపరాధము క్షమించండి . ఇకనుండి మేళా కాకుండా వెళ్ళను.నేను నికరముగా చెప్పుచున్నాను నా గురువు ఇక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్ళను .దైవ యోగమున ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటిలోనికి వెళ్ళినాడు. నా శిష్యుడు ఎక్కడకు వెళ్ళినాడు ? ఈ దినము అగుపించలేదే ? మని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు. అప్పుడతనితో ఇలాగున చెప్పినది నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు.గురువు మేళా ఎవరిదని అడిగినాడు అందులకా ముసలిది అది త్రినాధుని మేళా అని చెప్పినది. ఆ మాటలు విని గురువు అక్కడకు వెళ్లి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు. అది చూచి గురువుకు కోపం వచ్చి, బాగా తిట్టి, మేళా స్థలమును సామాగ్రిని కాలితో తన్నివేశాడు. తరువాత వైష్ణవుని పట్టుకుని బర బరా లాక్కు పోయాడు.

కొంత దూరము వెళ్లేసరికిబోరున వర్షము కురియసాగినది.bకటిక చీకటి కావడం వలన త్రోవ కన్పించడము లేదు గురు శిష్యులు చెల్లాచెదురై అతికష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు గురువు ఇంటిలో చూడగా, అతని తల్లి గడపవద్ద కూర్చుని ఏడ్చు చున్నది గురువు ఆశ్చర్యపడి లోనికి పోయిచూడగా అతని భార్య, కుమారుడు చనిపొయినారు.

చెంచుల కడుపు నింపుతున్న భూచక్రగడ్డ..

వారిని చూచి గురువు మూర్చబోయాడు శిష్యుడు పట్టుకుని లేపి కూర్చుండ బెట్టి, ముఖముపై నీళ్ళు చల్లి” అయ్యా ! తమరు త్రినాధ స్వామివారికి అపరాదులు, త్రినాధ మేళాను పాడు చేసారు. అందుకే మీకిది ప్రతిఫలము .మీరు నిష్టతో స్వామీ వారి మేళాను చేసిన యెడల మీ భార్యా కుమారులు బ్రతుకుతారు.” అని శిష్యుడనగా ఆ మాట విని గురువు ఐదు మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనగా, వెంటనే భార్యా కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాధ మేళా పాడుచేసినందుకు తగిన శిక్ష దొరికింది .”నేను మూర్ఖుడను ,అధముడను ప్రభువులవారి మహిమ తెలిసికొనలేకపోతిని ” అని ప్రభువుల వారిని క్షమాపణవేడి మేళాకు కావలసిన పదార్దములు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళాసమర్పించాడు . నూనె కాండము చెల్లినది .ప్రభువుల వారి పూజ కావచ్చినది .ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకుని సేవించి సుఖమనుభవించారు.

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post