YS Jagan : రాజకీయం కోసం జగన్ ఆడే రాక్షస క్రీడ..

YS Jagan : ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో నిర్బంధ ఆంగ్ల మాధ్యమం వద్దు, తెలుగు మాధ్యమం కూడా ఉండాలి ఆంగ్ల మాధ్యమం చదివిన ఉపాధ్యాయులతో దాన్ని దశలవారీగా అమలు చేయాలి అని చెప్తే.. దాన్ని వక్రీకరించి పేదవారికి ఆంగ్ల మాధ్యమం అందిస్తుంటే అడ్డుకున్నారు అని దుష్ప్రచారం చేసిన జగన్,

అసైన్డ్ చట్టానికి విరుద్ధంగా భూములు అమ్ముకునే వెసులుబాటు ఇవ్వడం కుదరదు.. వాటిని తాత్కాలిక ప్రయోజనాల కోసం అమ్ముకుంటారు అని చెప్తే పేదలకు భూములు పంచుతుంటే ఇష్టం లేక అడ్డుకున్నారు అని దుష్ప్రచారం చేసిన జగన్,

అమరావతిలో అభివృద్ధి కోసం వివిధ సంస్థలకు కేటాయించిన భూముల్ని పేద వాళ్ళకి ఎలా పంచుతారు అంటే.. రాజధానిలో పేదలు ఉండకూడదా అని వక్రభాష్యంతో ప్రచారం చేసిన జగన్,

Raghu Rama Krishnam Raju : విజయనగరం నుంచి బరిలోకి దిగనున్నారా..!?

ప్రభుత్వం మారినప్పుడు రాజధాని మార్పు చేయటం తగదు అని మూడు రాజధానులు వద్దు అన్నందుకు పరిపాలన వికేంద్రీకరణను అభివృద్ధి వికేంద్రీకరణగా మభ్యపెట్టి మేము రాజధానులుగా మార్చి మూడు ప్రాంతాలు అభివృద్ధి చేస్తుంటే అడ్డుకున్నారు అని దుష్ప్రచారం చేసిన జగన్,

సుప్రీం కోర్టు తీర్పులకు మరియు రాజ్యాంగానికి విరుద్ధమయిన విధాన నిర్ణయాలు తీసుకున్న ప్రతిసారి న్యాయస్థానం ఆ నిర్ణయాలను అడ్డుకుంటుంటే జడ్జిల మీద కులం బురద చల్లి దుష్ప్రచారం చేసిన జగన్,

వృద్ధులకూ వికలాంగులకూ పింఛన్ల పంపిణీ అంశంలో సచివాలయ ఉద్యోగులు అందుబాటులో ఉన్నా కూడా వాళ్ళని ఉపయోగించకుండా కేవలం రాజకీయ ప్రయోజనం కోసం చంద్రబాబు, పవన్ కోర్ట్ కి వెళ్లి ఇప్పుడిస్తున్న పెంక్షన్ లను ఇవ్వకుండా అడ్డుకున్నారు అని అబద్ధపు ప్రచారానికి పూనుకున్నారు.

వాలంటీర్లకు ఇచ్చే జీతం నెలకు 5 వేలు అంటే..
నెలనెలా 2 లక్షల మందికి జీతాల కింద అయ్యే వ్యయం 100 కోట్లు.. ఇలా
ఏడాదికి 1200 కోట్లు వాలంటీర్లు కోసం ఖర్చు పెడుతున్నాడు. వారి అవసరం అంతగా లేకున్నా కూడా ఇంత ఖర్చు చేయటం అంటే ప్రజాధనం వృథా చేయటమే జగన్ ఉద్దేశ్యంగా కనపడుతుంది. సచివాలయ సిబ్బందితో రెండు మూడు రోజుల్లో
పింఛన్లు ఇంటింటికీ పంచవచ్చు. వాలంటీర్లు మీద ఖర్చు పెట్టే ఆ డబ్బు ఇతర పథకాలకు ఉపయోగించ వచ్చు కానీ జగన్ అలా చేయడు.

Actor Suriya : విజయ్ రిజెక్ట్ కథతో మూడు సీక్వెల్స్ చేసిన సూర్య..

కేవలం జగన్ కీ వైసీపీకీ.. ప్రజలకి మంచి చేయాలి అనే ఉద్దేశం కన్నా మంచి చేస్తుంటే ప్రతిపక్షం అడ్డుకుంటుంది అని రాజకీయ ప్రయోజనం కోసం చేసే దుష్ప్రచారం వైపే ఎక్కువ మొగ్గు ఉంటుంది.

ప్రజలే ఓటు అనే ఆయుధంతో జగన్ ఆడే ఈ వికృత రాజకీయ రాక్షస క్రీడ కి ముగింపు పలకాలి.

Related Post