YS Jagan : గెలిచిన 10 మందిలో చివరిదాకా ఉండేది ఎందరు?

YS Jagan : రాజకీయాల్లో పార్టీలకు గెలుపోటములు సహజం. కానీ ప్రాంతీయ పార్టీలు ఓడిపోయిన తర్వాత వచ్చిన కొత్త ప్రభుత్వం తెచ్చే ఒత్తిళ్ళు తట్టుకుంటూ ఐదేళ్ల వరకు పార్టీని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్. ‘ప్రజారాజ్యం’ పేరుతో పార్టీ స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి, 18 స్థానాల్లో గెలిచిన తర్వాత కూడా తన పార్టీని ఐదేళ్లు ప్రతిపక్షంలో నెట్టుకురాలేకపోయారు. ఇప్పుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కుంటోంది.

కేవలం 11 సీట్లు గెలిచి, ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది వైసీపీ. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఐదేళ్లు పార్టీని కాపాడుకుంటూ, బలహీనపడిన కేడర్‌ని కాపాడుకోవడం మరో ఎత్తు. తెలంగాణలో టీడీపీకి తిరుగులేని ఓటు బ్యాంకు ఉండేది. అయితే రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణలో టిడిపిని, కేసీఆర్ నిర్వీర్యం చేసేశారు.

టీడీపీ కేడర్‌నీ దాదాపుగా తన పార్టీలోకి లాగేసుకున్నాడు. ఈ కారణంగానే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం పోటీ కూడా చేయలేదు తెలుగుదేశం పార్టీ.. కానీ టిడిపి ఓటు బ్యాంకుని మాత్రం కేసీఆర్ ఏమీ చేయలేకపోయాడు…
అందుకే ప్రతీ ఎన్నికలలో ఎన్టీఆర్‌గారిని పొగుడుతూ ఓట్లు రాల్చుకునే ప్రయత్నం చేసేవాడు.. టీడీపీ ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకునేందుకు 2023 శాసనసభ ఎన్నికలకు ముందు ఖమ్మంలో శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టించారు కూడా…

News Channels : అభివృద్ధికి ఆటంకం! ఏపీలో Tv9, Ntv, 10tv, సాక్షి టీవీలపై బ్యాన్..

2023 అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి పోటీ చేసినా గెలిచే అవకాశం లేదు… కానీ ఆ ఎన్నికలలో టిడిపి పోటీ చేయకపోవడం, కాంగ్రెస్ పార్టీకి సాయపడింది.. ఓ రాజకీయ పార్టీ ఎన్నికలలో పోటీ చేయకుండా మరో పార్టీని గెలిపించడం తన చేతికి మట్టి అంటించుకోకుండా కేసీఆర్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం రెండూ గొప్ప విషయాలు..

2014 ఎన్నికలలో ఏపీలో వైసీపి ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు, ప్రజాస్వామ్యానికి కట్టుబడి… ఆ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టలేదు. కాబట్టే జగన్ పాదయాత్ర చేసుకోగలిగారు. 2019 నాటికల్లా సర్వశక్తులు కూడగట్టుకొని అధికారంలోకి రాగలిగారు. ఆనాడు చంద్రబాబు నాయుడు, వైసీపిని అంతగా ఉపేక్షించడం వలననే అధికారం కోల్పోయారనే వాదనలు నేటికీ వినిపిస్తూనే ఉంది…

కానీ 2019లో ఏపీ సిఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రతిపక్షాలు అంటూ మొహమాటాలకు పోకుండా టిడిపిని ఉక్కుపాదంతో అణచివేస్తూ నిర్వీర్యం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశాడు… అదే సమయంలో రాష్ట్రంలో వైసీపి ఓటు బ్యాంక్ పెంచుకునేందుకు కూడా జగన్ గట్టి ప్రయత్నాలు చేశాడు. జగన్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండి ఉంటే టిడిపి మనుగడ సాగించడం పెద్ద వింతేమీ కాబోదు.

కానీ 5 ఏళ్ళపాటు ఏకధాటిగా దెబ్బ మీద దెబ్బ తీస్తున్నా పార్టీ చెల్లా చెదురు కాకుండా కాపాడుకోవడం చాలా కష్టం. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు కనబరిచిన పోరాటస్పూర్తి కారణంగానే టిడిపి బలంగా నిలబడుతూ జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కోగలిగింది.

జగన్ ఆలోచనలు, నిర్ణయాలు, విధానాలు కూడా టిడిపికి బాగా కలిసివచ్చాయి. వాటన్నిటినీ చంద్రబాబు నాయుడు తెలివిగా ఉపయోగించుకుంటూ ముందుకు సాగి ఎన్నికలలో వైసీపిని మట్టి కరిపించి మళ్ళీ అధికారంలోకి వచ్చారు.

ఈ 5 ఏళ్ళ చేదు అనుభవాలను చూసిన చంద్రబాబు నాయుడు ఈసారి వైసీపి పట్ల మెతకగా ఉండే అవకాశం అస్సలు లేదు… ఒకవేళ ఉందామనుకున్నా నారా లోకేష్, టిడిపి నేతలు ఉండనివ్వరు… కాబట్టి ఇప్పుడు వైసీపి చెల్లాచెదురు అయిపోకుండా జగన్ 5 ఏళ్ళు కాపాడుకోగలరా అనేదే ప్రశ్న?? అసలు ముందు తనను తాను కాపాడుకోగలరా? అంటే అది కూడా అనుమానమే.. జగన్ కాకుండా గెలిచిన 10 మందిలో ముగ్గురు ఇప్పటికే అధికార పార్టీలోకి జంప్ కావాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ.. తన ఉనికిని కాపాడుకోవడం చాలా కష్టమైపోతుంది..

Related Post