Vashu Bhagnani : ఒకే సినిమా దెబ్బకు రూ.250 కోట్ల నష్టం.. ఆస్తులు అమ్ముకుంటున్న రకుల్ ప్రీత్ మామ..

Vashu Bhagnani
Vashu Bhagnani

Vashu Bhagnani : టాలీవుడ్‌ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, తెలుగులో స్ట్రైయిక్ సినిమా చేసి మూడేళ్లు దాటింది. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘కొండపొలం’మూవీలో చివరిగా కనిపించిన రకుల్, ‘బో’ అనే తమిళ్ హర్రర్ సినిమాలో నటించింది. రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో బాలీవుడ్ కుర్ర నటుడు జాకీ భగానిని పెళ్లి చేసుకోనుంది. జాకీ భగానీ తండ్రి వసు భగానీ, బాలీవుడ్‌లో బడా ప్రొడ్యూసర్. అయితే కొన్నాళ్లుగా వసు భగానికి టైం ఏ మాత్రం కలిసి రావడం లేదు. వసు భగానీ, కొడుకు జాకీ భగానీ కలిసి నిర్మించిన ‘భడే మియాన్ చోటే మియాన్’ సినిమా, డిజాస్టర్‌గా మిగిలింది.

ఈ సినిమాని రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తే, బాక్సాఫీస్ దగ్గర వెనక్కి వచ్చింది రూ.100 కోట్లు మాత్రమే. రూ.250 కోట్ల నష్టాలు రావడంతో వసు భగానీ, తన ఆస్తులను అమ్ముకుంటున్నాడట. ఇప్పటికే తన ఆఫీసులో 80 శాతం మంది ఉద్యోగులను జీతాలు ఇవ్వలేని పొజిషన్‌లో ఉన్నానని తొలగించిన వసు భగానీ, అప్పులు తీర్చేందుకు నానా కష్టాలు పడుతున్నాడట.

Bollywood : బాలీవుడ్‌ పనైపోయిందా..!?

ఇంతకుముందు అక్షయ్ కుమార్‌తో రెండు సినిమాలు, టైగర్ ష్రాఫ్‌తో రెండు సినిమాలు నిర్మించాడు వసు భగానీ. ఈ సినిమాలు కూడా అప్పులనే తెచ్చిపెట్టాయి. టైగర్ ష్రాఫ్ హీరోగా వచ్చిన ‘గణ్‌పత్’ సినిమాకి రూ.200 కోట్లు ఖర్చుపెడితే వచ్చితే రూ.13 కోట్లు మాత్రమే. అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ‘బెల్ బాటమ్’ సినిమా కోసం రూ.150 కోట్లు ఖర్చు చేస్తే, రూ.50 కోట్లే వెనక్కి వచ్చాయి. ‘వెల్‌కమ్ టు న్యూయార్క్’, ‘దిల్ జంగిల్’ ఇలా తీసిన సినిమాలన్నీ డిజాస్టర్లే.. వీటిని వెనక్కి తెస్తారనుకున్న ‘బడే మియాన్ చోటే మియాన్’, ఆ నష్టాలను రెండింతలు చేశారు..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post