Manamey Pre-release Event : పిఠాపురంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..

Manamey Pre-release Event : ఏపీ ఎలక్షన్స్ కారణంగా ఇప్పుడు యావత్ భారతం పిఠాపురం వైపు చూస్తోంది. పిఠాపురంలో పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ ఖరారు చేశారు. ఎంత మెజారిటీతో పవన్ కళ్యాణ్‌ గెలవబోతున్నాడనే విషయంలో అక్కడ జోరుగా బెట్టింగులు కూడా జరుగుతున్నాయి. ఈ జోరును పబ్లిసిటీ వాడుకోవాలని చూస్తున్నాడు హీరో శర్వానంద్. జూన్ 4న ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తుండగా, జూన్ 5న పిఠాపురంలో ‘ మనమే’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట..

శర్వానంద్ హీరోగా నటించిన ‘మనమే’ సినిమా ట్రైలర్‌ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశాడు. ‘మనమే’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి కూడా రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు సమాచారం. అయితే పిఠాపురంలో మూవీ వేడుక నిర్వహించేందుకు ఇంకా పోలీస్ అధికారులు పర్మిషన్ ఇవ్వలేదట. జూన్ 4న రిజల్ట్ వచ్చిన తర్వాత ఆంధ్రాలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో అని భయాందోళనలు నెలకొన్నాయి. పోలింగ్ తర్వాత ఏపీలో చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం కనిపించింది..

పల్నాడులో అయితే రెండు రాజకీయ వర్గాల మధ్య యుద్ధ వాతావరణం కనిపించింది. బాంబు దాడులు కూడా జరగడంతో ఈసారి ఎలక్షన్ రిజల్ట్స్‌కి రెండు రోజుల ముందే పల్నాడులో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. దాదాపు 1500 మంది పోలీసులు, పల్నాడులో గస్తీ కాస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపలాగా ఉన్నారు. దీంతో ఎలక్షన్ల ఫలితాలు వెలువడిన తర్వాత ‘మనమే’ ప్రీ-రిలీజ్‌కి పర్మిషన్ దక్కుతుందా? లేదా? అనేది తేలనుంది. ఒకవేళ పిఠాపురంలో పర్మిషన్ రాకపోతే విజయవాడ లేదా వైజాగ్‌లో ఈవెంట్ చేయాలని ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్..

శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘మనమే’ మూవీలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ అన్నీ జనాలను ఇంప్రెస్ చేసేలాగే ఉన్నాయి. చాలా రోజుల తర్వాత శర్వానంద్ హుషారైన పాత్రలో కనిపిస్తున్నాడు. జూన్ 7న ‘మనమే’ సినిమా థియేటర్లలోకి రానుంది.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post