Mahesh Babu Trivikram : ఘాటు సరిపోలేదు..!?

Mahesh Babu Trivikram : మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘గుంటూర్ కారం’ మూవీ, తీవ్రమైన నెగిటివ టాక్ తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ‘అజ్ఞాతవాసి’ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ ఫ్యాన్స్ కోసం ‘గుంటూర్ కారం’ దించాడని అన్నారు. ‘అజ్ఞాతవాసి 2.0’ అంటూ ట్రోల్స్ చేశారు. అయితే ఈ సినిమా తీవ్రమైన నెగిటివిటీని తట్టుకుని కూడా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 65 శాతానికి పైగా వెనక్కి రాబట్టింది. కొన్ని ఏరియాల్లో లాభాలు, మరికొన్ని ఏరియాల్లో తీవ్రమైన నష్టాలు వచ్చాయి. అయితే నిర్మాతలు మాత్రం అన్ని ఏరియాల్లో లాభాలు వచ్చాయని ప్రకటించుకున్నారు.

Trolls on Guntur Kaaram : అప్పుడేమో రొమాంటిక్ డ్యాన్స్.. ఇప్పుడేమో తల్లీ కొడుకులుగా..

ఈ విషయం పక్కనబెడితే, ‘గుంటూర్ కారం’ వంటి ఫెయిల్యూర్ తర్వాత కూడా మళ్లీ తివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడట మహేష్ బాబు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ చేస్తున్నాడు మహేష్. జక్కన్న సినిమా మొదలెడితే, అది ఎప్పటికి అవుతుందో ఆయనకే తెలీదు… దాదాపు మూడేళ్లు రాజమౌళి సినిమా కోసం డేట్స్ ఇచ్చిన మహేష్ బాబు, రెండు పార్టులుగా సినిమాని థియేటర్లలోకి తీసుకురాబోతున్నాడు..

జక్కన్నతో సినిమా అయ్యాక ‘గుంటూర్ కారం’ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతంది. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ మళ్లీ గురూజీతో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ‘గుంటూర్ కారం’ మూవీ ప్రమోషన్స్‌లో మళ్లీ ఎప్పుడు రీజినల్ మూవీ చేస్తానో తెలీదు అంటూ వ్యాఖ్యానించాడు మహేష్. అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమాని పాన్ ఇండియా లెవెల్‌లో ప్లాన్ చేయాలని అనుకుంటున్నాడట. అయినా నాలుగేళ్ల తర్వాతి విషయం ఇది. అప్పటికి ఈ కాంబోలో ఉండొచ్చు, మహేష్ మనసు ఎప్పుడైనా మారొచ్చు..

Guntur Kaaram : గుంటూరు కారం ఫ్లాప్ కి బాధ్యులెవరు..!?

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post