కార్తీక పురాణం.. మొదటి రోజు వినాల్సి కథ..

Karthika Masam : 

మొదటి రోజు పారాయణము
శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన
శ్లో॥ వాగీశాద్యా స్సుమనప స్సర్వారానా ముపక్రమే| యంనత్వా కృతకృత్యాస్స్యుస్తంనమామి గజాననమ్ ||

శౌనకాదులసుతుడు కార్తీక పురాణమును చెప్పుట: పూర్వ నైమిశారణ్యమునకు సూతమహర్షి రాగా ఆయనను శౌనకాది మునులు సత్కరించి, సంతుష్టుని చేసి, కైవల్యదాయకము అయిన కార్తీకమాస మహాత్మ్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయుమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాసశిష్యుడైన సూతర్షి -“శౌనకాదులారా! మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఈ కార్తీక మహాత్మ్యాన్ని – అష్టాదశ పురాణములలోని స్కాంద, పద్మ పురాణములు రెండింటా కూడా వక్కాణించి వున్నారు.

ఋషి రాజైన శ్రీ వశిష్ఠుల వారిచే, రాజర్షియైన జనకునకు స్కాంద పురాణములోనూ, హేలావిలాస బాలామణియైన సత్యభామకు. లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణపరమాత్మచే పద్మ పురాణములోనూ ఈ కార్తీక మహాత్మ్యము సవిస్తరముగా చెప్పబడినది. మన అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము. కావున – ప్రతి రోజూ నిత్య పారాయణగా – ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసికొందాము. ముందుగా స్కాందపురాణములోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపిస్తాను వినండి’ అంటూ చెప్పసాగాడు.

లార్డ్ కృష్ణ మంత్రాలు నేర్చుకుంటున్న అలహాబాద్ యూనివర్శిటీ విద్యార్థులు..

జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములడుగుట:

పూర్వమొకసారి సిద్ధాశ్రమములో జరుగుతున్నా యాగానికవసరమైన ద్రవ్యాధియైన వశిష్ఠ మహర్షి జనకమహారాజు ఇంటికి వెళ్లాడు. జనకునిచే యుక్త మర్యాదలు అందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి – ‘హే బ్రహ్మర్షీ! మీ యగానికెంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. కాని సర్వపాపహరమైన ధర్మసూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరములోని సర్వమాసముల కంటెను కార్తీకమాసం అత్యంత మహణమావహిమాన్వితమైనదనీ, తర్వతా చరణము సమస్తధర్మాల కన్నా శ్రేష్ఠతరమైనదనీ చెబుతూ వుంటారు గదా! ఆ నెలకు అంత ప్రాముఖ్యమెలా కలిగింది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మమే విధంగా అయింది’ అని అడుగగా – మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు, జ్ఞాన హాసమును చేసతూ, ఇలా ప్రవంచినాడు.

Karthika Masam

వశిష్ఠ ప్రవచనము :

జనక మహారాజా! పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనేగాని, సత్వశుద్ధి కలుగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనదీ, వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలనూ అణచి వేసేదీ అయిన – కార్తీక మహాత్మ్యమును వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో వుంచుకుని నీవడిగిన సంగతులను చెబుతాను, విను. ఓ విదేహా! కార్తీకమాసములో సూర్యుడు తులా సంక్రమణముతో వుండగా సహృదయతతో – ఆచరించే స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో, ఈ కార్తీక వ్రతాన్ని తులాసంక్రమణాదిగా గాని, శుద్ధ పాడ్యమి నుంచి గాని ప్రారంభించాలి. ముందుగా –

శ్లో॥ “సర్వపాప హరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే |

ఓ దామోదరా ! నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయుము అని నమస్కార పూర్వకముగా సంకల్పించుకొని, కార్తీక స్నానమాచరించాలి. కార్తీకమందలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాల యందునా చేరుతుంది. వాపీకూప తటాకాది సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి వుంటాడు. బ్రాహ్మణుడయిన వాడు కార్తీక మాసములో నదికి వెళ్ళి హరి ధ్యానయుతుడై, కాళ్లూ-చేతులూ కడుగకొని, ఆచమించి,

శుద్ధాత్ముడై మంత్ర యుక్తముగా భైరవాజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి స్నానము చేయాలి. పిదప దేవతలకు, ఋషులకు పితరులకు తర్పణాలను వదలాలి. అనంతరం అఘమర్షణ మంత్రజపంతో, బొటనవ్రేలి కొసతో నీటిని కెలికి, మూడు దోపెళ్ల నీళ్లను గట్టుమీకు జిమ్మి, తీరము చేయాలి. చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి. దీనినే యక్ష తర్పణమంటారు. అనంతరం ఒళ్లు తుడుచుకుని, పొడివి-మడివి-తెల్లనియైన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి. గోపీచందనంతో 12 ఊర్ధ్వపుండ్రాలను ధరించి, సంధ్యావందన గాయత్రీ జపాలను ఆచరించాలి. ఆ తరువాత – ఔపాసనము చేసి, బ్రహ్మయజ్ఞ మాచరించి, తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖ చక్రధారియైన విష్ణువును – సాలగ్రామ మందు నుంచి సభక్తిగా షోడశోపచారాలతోనూ పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణ పఠనమును గాని, శ్రవణమును గాని ఆచరించినవాడై, స్వగృహాన్ని చేరి, దేవతార్చన, వైశ్వ దేవాదులను చేసి, భోజనమును చేసి, ఆచమించి పునః పురాణ కాలక్షేపమును చేయాలి.

సాయంకాలము కాగానే ఇతర వ్యాపారాలనన్నిటినీ విరమించుకుని – శివాలయములోగాని, విష్ణ్యాలయములోగాని యథాశక్తి దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆరాధించి, భక్ష్యభోజ్యదులు నివేదించి శుద్ధ వాక్కులతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి.

ఈ కార్తీక మాసము పొడుగునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు. ప్రస్తుత పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి.

వర్ణాశ్రమ లింగవయోభేద రహితముగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్లు మోక్షార్హులు కావడం నిస్సంశయము. జనకరాజా! తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేక పోయినా – ఇతరులు చేస్తుండగా చూసి, అసూయారహితుడై ఆనందించే వానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణుకృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి.

Karthika Masam

ద్వితీయాధ్యాయము

కార్తీక సోమవార వ్రతము

వశిష్ఠ ఉవాచ: హే జనక మహారాజా! వినినంత మాత్రము చేతనే మనోవాక్కాయముల

ద్వారా చేయబడిన సర్వపాపాలనూ హరింపచేసే కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్ధగా విను సుమా! అందునా, ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీకమాసంలో వచ్చే ఏ సోమవారము నాడయినా సరే – స్నాన, జపాదులను ఆచరించిన వాడు వెయ్యి అశ్వమేథాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రతవిధి ఆరురకాలుగా ఉంది.

1. ఉపవాసము
2 ఏకభక్తము
3. నక్తము
4. అయాచితము
5. స్నానము
6. తిలదానం

1.ఉపవాసము: శక్తిగలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనము (ఉపవాసము)తో గడిపి, సాయంకాలమున శివాభిషేకం చేసి, నక్షత్ర దర్శనానంతరమున తులసితీర్థము మాత్రమే సేవించాలి.

2. ఏకభక్తము: సాధ్యం కాని వాళ్లు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా

చేసికొని – మధ్యాహ్నమున భోజనము చేసి, రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థమో తులసీ

తీర్థమో మాత్రమే తీసుకోవాలి.

3.నక్తము: పగలంతా ఉపవసించి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనమునకు గాని, ఉపాహారమును గాని స్వీకరించాలి.

4. అయాచితము: భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం ‘అయాచితము’

5.స్నానము: పై వాటికి వేటికీ శక్తి లేని వాళ్లు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికిన్నీ చాలును.

6. తిలదానము: మంత్ర జపవిధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారము నాడు నువ్వులను దానము చేసినా సరిపోతుంది.

పై ‘ఆరు’ పద్ధతులలో దేవిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతము చేసినట్లే అవుతుంది. కానీ, తెలుసుండి కూడా ఏ ఒక్కదానినీ ఆచరించని వాళ్లు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని ఆర్షవాక్యము. ఈ వ్రతాచరణము వలన అనాథలూ, స్త్రీలు కూడా విష్ణు సాయుజ్యమును పొందుతారు. కార్తీక మాసములో వచ్చే ప్రతి సోమవారము నాడూ కూడా పగలు ఉపవసించి, రాత్రి నక్షత్ర దర్శనానంతరము మాత్రమే భోజనము చేస్తూ – ఆ రోజంతా భగవద్ధ్యానములో గడిపే వాళ్లు తప్పనిసరిగా శివసాయుజ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసే వాళ్లు నమక చమక సహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలిసికోవాలి. ఈ సోమవార వ్రతఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను.

నెట్‌ఫ్లిక్స్‌లో వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి వీడియో… సినిమా రైట్స్‌ రేటుకి అమ్మేసిన మెగా ఫ్యామిలీ..

విష్ణురి కథ

పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి ‘విష్ణురి’ అనే కూతురుండేది. పుష్టిగానూ, అందంగానూ, అత్యంత విలాసంగానూ వుండే ఈమెకు గుణాలు మాత్రం శిష్ఠమైనవి అబ్బలేదు. దుష్టగుణ భూయిష్టమై, గయ్యాళిగానూ, కాముకురాలుగానూ చరించే ఈ ‘నిష్ఠురి’ని ఆమె గుణాల రీత్యా ‘కర్కశ’ అని కూడా పిలుస్తూ వుండేవారు. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడయిన మిత్రశర్మ అనేవానికిచ్చి, తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడూ, సరసుడూ మాత్రమేకాక సహృదయుడు కూడా కావడం వలన కర్కశ ఆడినది పాటగా, పాడినది పాటగా కొనసాగజొచ్చింది. పైగా ఆమె ప్రతి రోజూ తన భర్తను తిడుతూ, కొడుతూ వుండేది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక, భార్యను పరిత్యజించడం తన వంశానికి పరువు తక్కువనే ఆలోచన వలన మిత్రశర్మ, కర్కశ పెట్టే కఠిన హింసలనన్నిటినీ భరిస్తూనే వుండేవాడు గాని, ఏనాడు ఆమెను శిక్షించలేదు. ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధమును పెట్టుకుని, భర్తను, అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకానొకనాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ ‘నీ మొగుడు బ్రతికి వుండటం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం’ అని రెచ్చగొట్టడంతో – కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రాముద్రితుడై వున్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి, ఆ శవాన్ని తానే మోసుకుని పోయి ఒక పాడుబడిన నూతిలోనికి విసిరి వేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడం చేత, అత్తమామలు ఆమెనేమీ అనలేక, తామే ఇల్లు వదిలి పారిపోయారు.

అంతటితో మరింత స్వతంత్రించిన కర్కశ కన్నుమిన్నుగానని కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కము పెట్టుకొని – ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింప జేసి తన విటులకు తార్చి, తద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది. దాని బలం తగ్గింది.

పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని, అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పూలగుత్తిలాంటి మేను పుళ్లుపడిపోయినది. జిగిబిగీ తగ్గిన కర్కశ వద్దకు విటుల రాకపోకలు తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. అందరికందరూ ఆమెను అసహ్యించుకోసాగారు. తుదకు అక్రమపతులకే గాని సుతులకు నోచుకోని ఆ నిష్ఠుర, తినడానికి తిండి, ఉండేందుకింత ఇల్లూ, వంటినిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువైనదై, సుఖవ్రణాలతో నడివీధినపడి మరణించింది. కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కుకూడా లేకపోయింది. యమదూతలు ఆ జీవిని పాశబద్ధను చేసి, నరకానికి తీసుకు వెళ్లారు. యముడామెకు దుర్భరమైన శిక్షలను విధించాడు.

భర్తృద్రోహికి భయంకర నరకం:

భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనము చేసుకున్న పాపానికి – ఆమె చేత మండుతున్న జనసస్తంభాన్ని కౌగిలింపచేశాడు. భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చిట్లేటట్లు మోదించాడు. భర్తను దూషించినందుకు కొట్టినందుకు, తన్నినందుకు దాని పాదాలను పట్టుకుని, కఠినశిలలపై వేసి బాదించాడు. సీసమును గాని చెవులలో పోయించాడు. కుంభీపాక నరకానికి పంపాడు. ఆమె పాపాలకు గాను ఆమె ముందరి పది తరాలవారూ, తదుపరి పది తరాలవారూ – ఆమెతో కలిసి మొత్తం 21 తరాల వాళ్లూ కుంభీపాకములో కుమిలిపోసాగారు. నరకానుభవము తర్వాత ఆమె పది హేనుసార్లు భూమి పై కుక్కగా జన్మించినది. పదిహేనవ పర్యాయమున కళింగ దేశములో కుక్కగా పుట్టి, ఒకానొక బ్రాహ్మణ గృహములో వుంటూ వుండేది.

సోమవార వ్రతఫలముచే కుక్క కైలాసమందుట:

ఇలా వుండగా, ఒక కార్తీక సోమవారము నాడా బ్రాహ్మణుడు పగలు ఉపవాసముండి, శివాభిషేకాదులను నిర్వర్తించి, నక్షత్ర దర్శనానంతరము, నక్త స్వీకారానికి సిద్ధపడి, ఇంటి బయలులో బలిని విడిచి పెట్టాడు. ఆనాడంతా ఆహారము దొరకక పస్తుపడి వున్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించినది. బలి భోజనము వలన దానికి పూర్వస్మతి కలిగి – “ఓ విప్రుడా రక్షింపమని కుయ్యి పెట్టినది. దాని అరుపులు విని వచ్చిన విప్రుడు – కుక్క. మాటలాడటాన్ని గమనించి విస్తుపోతూనే “ఏమి తప్పు చేశావు? నిన్ను నేనెలా రక్షించగలను?” అని అడిగాడు.

అందుకా కుక్క ‘ఓ బ్రాహ్మణుడా! పూర్వజన్మలో నేనొక విప్ర వనితను. కామముతో కండ్లు మూసుకు పోయి, జారత్వానికి ఒడిగట్టి, భర్తృహత్యకూ, వర్ణసంకరానికి కారకురాలినైన పతితను. ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలనుభవించి ఈ భూమిపై ఇప్పటికి 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. అటువంటిది – ఇప్పుడు నాకు హఠాత్తుగా

ఈ పురాజన్మ లెందుకకు గుర్తుకు వచ్చాయో అర్థము కావడం లేదు. దయచేసి విశదపరుచుమని కోరినది.

స్కూల్స్ బంద్.. బండ్లు రోడ్లు ఎక్కాలంటే రూల్.. ఢిల్లీలో పెరిగిన కాలుష్యానికి..

బ్రాహ్మణుడు సర్వాన్నీ జ్ఞాన దృష్టి చేత తెలుసుకుని ‘శునకమా! ఈ కార్తీక సోమవారమునాడు ప్రదోషవేళ వరకు పస్తుపడి వుండి – నాచే విడువబడిన బలిభక్షణమును చేయుట వలననే నీకీ పూర్వజన్మ జ్ఞానము కలిగిన ‘దని చెప్పాడు. ఆపై నా జాగిలము ‘కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా! నాకు మోక్షమెలా సిద్ధించునో ఆనతీయుమని కోరిన మీదట, దయాళువైన ఆ భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో – ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకి ధారపోయగా, ఆ క్షణమే ఆ కుక్క తన శునక దేహాన్ని పరిత్యజించి – దివ్య స్త్రీ శరీరిణియై – ప్రకాశమానహార వస్త్ర విభూషితయై, పితృదేవతా సమన్వితయై కైలాసమునకు చేరినది కాబట్టి ఓ జనక మహారాజా! నిస్సంశయ నిశ్రేయపదాయియైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు’ అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు.

ద్వితీయోధ్యాయ సృమాస్త మొదటి రోజు పారాయణము సమాప్తము

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post