చెప్పినట్టే చిరంజీవి, త్రిషలపై కేసు వేసిన మన్సూర్ ఆలీ ఖాన్..

Mansoor Ali Khan filed a case against Chiranjeevi and Trisha : ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను.. అన్నట్టుగా త్రిష- మన్సూర్ ఆలీ ఖాన్ వివాదం గురించి ట్వీట్ చేసి, లేని పోని చిక్కుల్లో ఇరుక్కున్నాడు మెగాస్టార్ చిరంజీవి. త్రిషతో కలిసి ‘లియో’ మూవీలో నటించిన మన్సూర్ ఆలీ ఖాన్, ఆమెతో బెడ్ రూమ్ సీన్ ఉంటుందేమో, రేప్ సీన్ ఉంటుందేమోనని ఆశపడ్డట్టు అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

త్రిషను రేప్ చేయాలని అనుకున్నా! ‘లియో’ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ షాకింగ్ కామెంట్స్..

ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించిన త్రిష, మన్సూర్‌తో ఇకపై సినిమాలు చేయనని చెప్పింది. ఈ వివాదం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపడంతో ‘లియో’ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి, నడియార్ సంఘం సభ్యురాలు ఖుష్భూ కూడా స్పందించారు. ఈ విషయంతో అస్సలు సంబంధం లేని మెగాస్టార్ చిరంజీవి, త్రిషకు అండగా నిలుస్తున్నట్టు, మన్సూర్ ఆలీ ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ట్వీట్ చేశాడు.

చిరంజీవి, ప్రతీ ఏడాది పాత హీరోయిన్లతో పార్టీ చేసుకుంటాడు! అతనా నాకు చెప్పేది..

దీంతో తానేం మాట్లాడానో కూడా తెలుసుకోకుండా ఇలా ట్వీట్ చేసినందుకు రూ.20 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు మన్సూర్ ఆలీ ఖాన్. అలాగే త్రిష, ఖుష్భూ మరో పదేసి కోట్లు ఇవ్వాలని, ఈ రూ.40 కోట్లకు ప్రజల సంక్షేమం కోసం వాడతానని వ్యాఖ్యానించాడు. అయితే మన్సూర్ డిమాండ్‌కి వీళ్లు స్పందించకపోవడంతో త్రిష, చిరంజీవి, ఖుష్భూలపై పరువు నష్టం దావా వేశాడు మన్సూర్ ఆలీ ఖాన్. దీనిపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post