YS Jagan : అప్పుడు కోడి కత్తి! ఇప్పుడు రాయి దాడి..

YS Jagan : రాజకీయాల్లో సెంటిమెంట్లు చాలా కామన్… ఓసారి సానుభూతి సెంటిమెంట్ క్లిక్ అయితే దాన్ని రిపీట్ చేయడం కూడా కామన్. విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై దాడి జరిగింది. బస్సుపై నుంచి నిలబడి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో పూలమాలలతో పాటు ఓ అభిమాని విసిరిన రాయి వచ్చి, జగన్ కనుబొమ్మకు పైన తాకింది.

రాయి బలంగా తగలడంతో జగన్ ఎడమకంటి కనుబొమ్మపైన గాయం అయ్యింది. వెంటనే జగన్‌ని పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించి, వైద్యం అందించారు. ప్రథమ చికిత్స తర్వాత సీఎం జగన్ మళ్లీ బస్సు యాత్ర కొనసాగించారు. ఇంతకుముందు 2019 ఎన్నికల ముందు కూడా ఇదే విధంగా జగన్‌పైన కోడికత్త దాడి జరిగింది. ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది.

Pawan Kalyan : అవి మనకెందుకంటే, మడిచి పెట్టుకో అన్నాడు..

అందుకేనేమో ఈసారి జగన్‌పైన రాయి దాడిపై పెద్దగా రాద్ధాంతం జరగలేదు. కేవలం సానుభూతి కోసమే జగన్‌పై ఆయన అభిమానులు దాడి చేసి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. అలాగే జగన్‌కి వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక, టీడీపీ వర్గాలే దాడి చేసి ఉండొచ్చని కొందరు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post