పల్లవి ప్రశాంత్‌పై న్యూసెన్స్ కేసు.. పరారీలో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్..

Nuisance case against Bigg Boss 7 Telugu Winner Pallavi Prashanth : ఓ సాధారణ యువకుడిగా బిగ్ బాస్ సీజన్ 7 ప్రోగ్రామ్‌లోకి అడుగుపెట్టి, టైటిల్ విజేతగా నిలిచాడు పల్లవి ప్రశాంత్. ‘అన్నా మల్లొచ్చినా.. రైతు బిడ్డ’ అంటూ రీల్స్ చేస్తూ పాపులారిటీ దక్కించుకున్న పల్లవి ప్రశాంత్, బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తర్వాత నిజస్వరూపం చూపిస్తున్నాడు.

‘బిగ్‌బాస్’ నిజంగా స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తుందా..!?

బిగ్ బాస్ గెలిచిన తర్వాత సెలబ్రేషన్స్‌తో రచ్చ చేసిన పల్లవి ప్రశాంత్‌పై న్యూసెన్స్ కేసు నమోదైంది. బిగ్ బాస్ ఫైనల్ తర్వాత అమర్‌దీప్, అశ్వినీ వంటి కంటెస్టెంట్ల కార్లపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడులు చేశారు. అటుగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సుపై కూడా దాడి చేశాడు.

బిగ్ బాస్ విన్నర్ అతనే, కానీ ఎక్కువ తీసుకుంది మాత్రం శివాజీయే.. ఎలాగంటే..

కేసు నమోదు చేసుకున్న జూబ్లిహిల్స్ పోలీసులు, దాడులకు కారణమైన పల్లవి ప్రశాంత్‌‌ని A1 ముద్దాయిగా కేసు రిజిస్టర్ చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పల్లవి ప్రశాంత్, ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసినట్టు తెలిసింది. అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post