ఆ ఇద్దరి మధ్య బిగ్ బాస్ 7 ఫైనల్.. సామాన్యుడితో పోటీ పడబోయేది ఎవరంటే..

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7, గత సీజన్ కంటే భారీ టీఆర్పీ తెచ్చుకుంది. ఓ సామాన్యుడిగా హౌజ్‌లోకి అడుగుపెట్టిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, ఫైనల్ దాకా వచ్చి.. సరికొత్త సంచలనం క్రియేట్ చేశాడు. ఫైనల్ వీక్‌లో పల్లవి ప్రశాంత్‌తో పాటు టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ, సీరియల్ నటుడు అమర్‌దీప్, మోడల్ యావర్, సీరియల్ నటి ప్రియాంక నిలిచారు.

యూట్యూబ్ స్టార్లతో సూపర్ హిట్లు! ఈ ఐడియా ఏదో భలేగా ఉందే..

వీరిలో పల్లవి ప్రశాంత్, ఏకగ్రీవంగా టైటిల్ విజేతగా నిలుస్తాడని టాక్. ఫైనల్ ఎపిసోడ్‌లో అంబటి అర్జున్ మొదటిగా ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రియాంక జైన్‌, బయటికి వచ్చేసింది. టాప్ 4లో అందరూ మగాళ్లే నిలిచారు. టాప్ 4లో ఉన్న యావర్, సూట్ కేస్ ఆఫర్ రాగానే రూ.15 లక్షలతో బయటికి వచ్చేశాడు.

‘బిగ్‌బాస్’ నిజంగా స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తుందా..!?

టైటిల్ విన్నర్ ఫెవరెట్ శివాజీ, టాప్ 3గా నిలిచాడు. సామాన్యుడు పల్లవి ప్రశాంత్‌తో టైటిల్ ఫైట్‌ కోసం పోటీపడబోతున్నాడు సీరియల్ యాక్టర్ అమర్‌దీప్. ఓట్ల ప్రకారం చూసుకుంటే పల్లవి ప్రశాంత్, బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్. అయితే బిగ్ బాస్ యాజమాన్యం స్క్రిప్టు ఏమైనా మారుస్తుందా? అనేది చూడాలి.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post