నయనతార, అనుష్క, కాజల్.. ఆఖరికి త్రిషకి ఫిక్స్ అయ్యారు! చిరంజీవి అందుకే..

Trisha confirmed for Chiranjeevi’s next Movie Viswambhara : ‘భోళా శంకర్’ డిజాస్టర్ రిజల్ట్‌తో మెగాస్టార్ చిరంజీవి, సినిమాల సెలక్షన్‌ విషయంలో కాస్త జాగ్రత్త పడడం మొదలెట్టాడు. రీఎంట్రీ తర్వాత వరుసగా సినిమా తర్వాత సినిమా రీమేక్స్‌ చేయాలని అనుకున్న మెగాస్టార్ చిరంజీవి.. పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాడు. ‘వాల్తేరు వీరయ్య’ బాగానే ఆడినా, మెగా ఫ్యాన్స్‌ని కూడా పూర్తిగా మెప్పించలేకపోయింది.

‘రోబో’ మూవీ, ఉపేంద్ర మూవీకి కాపీయా..? శంకర్ కంటే చాలా ఏళ్ల ముందే..

‘బింబిసార’ దర్శకుడు వశిష్టతో ‘విశ్వంభర’ అనే సినిమా చేయబోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. చిరూ వయసుకి తగ్గట్టుగా ఈ మూవీలో మెగాస్టార్ ఓల్డ్ ఏజ్‌లో కనిపిస్తాడని దర్శకుడు చెప్పాడు కూడా. అయితే తాను ముసలివాడిగా కనిపిస్తే ఫ్యాన్స్ ఒప్పుకోరని, హీరోయిన్, ఐటెం సాంగ్, స్టెప్పులు ఉండాల్సిందేనని మెగాస్టార్ చిరంజీవి పట్టుబట్టాడట. దీంతో ‘విశ్వంభర’ కథలో కొన్ని మార్పులు చేసి, హీరోయిన్ పాత్రను జోడించారు.

తొలుత ‘విశ్వంభర’లో నయనతార హీరోయిన్‌గా నటించబోతుందని టాక్ వినిపించింది. ఆ తర్వాత స్వీటీ అనుష్క శర్మ, హీరోయిన్‌గా నటిస్తుందని కథనాలు వెలువడ్డాయి. ‘ఖైది నెం.150’లో చిరుతో ఆడిపాడిన కాజల్ అగర్వాల్‌ని ఫైనల్ చేసినట్టు టాక్ వినిపించింది. తాజాగా ఇప్పుడు త్రిషతో సెటిల్ అయినట్టు సమాచారం.

చెప్పినట్టే చిరంజీవి, త్రిషలపై కేసు వేసిన మన్సూర్ ఆలీ ఖాన్..

ఈ ఇద్దరూ ఇంతకుముందు ‘స్టాలిన్’ సినిమాలో నటించారు. త్రిష, మన్సూర్ ఆలీ ఖాన్ వివాదంపై టాలీవుడ్ అంతా సైలెంట్‌గా ఉన్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేయడానికి కారణం ఇదేనని కూడా అంటున్నారు టాలీవుడ్ జనాలు. చిరు వేసిన ట్వీట్ కారణంగా రూ.40 కోట్లు డిమాండ్ చేసిన మన్సూర్ ఆలీ ఖాన్, పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post