Sai Dharam Tej : బడ్జెట్‌ పెరిగి ఆగిన సాయిధరమ్ తేజ్ సినిమా! ఆ మూవీకి సీక్వెల్ ప్లాన్..

Sai Dharam Tej : ‘విరూపాక్ష’ మూవీతో మంచి కమ్‌బ్యాక్ హిట్టు కొట్టాడు సాయి ధరమ్ తేజ్. అయితే ఈ మూవీ తర్వాత చేసిన ‘Bro’ మూవీ పూర్తిగా వెనక్కి రాబట్టలేకపోయింది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్, సంపత్ నంది దర్శకత్వంలో ‘గంజా శంకర్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి రూ.100 కోట్ల బడ్జెట్ అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.

రూ.100 కోట్లు అనుకుని మొదలెడితే, రూ.120 కోట్లు దాటేస్తుంది సినిమా బడ్జెట్.. అంటే దాదాపు రూ.200 కోట్లు వసూలు చేస్తేనే సినిమా హిట్టు స్టేటస్ దక్కించుకుంటుంది. టైర్ 1 స్టార్ హీరోలకు ఈ టార్గెట్ అందుకోవడం చాలా కష్టం. అలాంటిది సాయిధరమ్ తేజ్‌‌కి ఉన్న మార్కెట్‌కి ఇది చాలా పెద్ద టార్గెట్ అవుతుంది.. దీంతో ఈ సినిమా షూటింగ్ మొదలెట్టకముందే ఆగిపోయినట్టు సమాచారం..

ఆగిపోగిన సినిమాకి ‘గంజా’ టైటిల్‌ మార్చాలంటూ నారోటిక్స్ బ్యూరో నోటీసులు పంపింది. ఇప్పుడు ‘చిత్రలహరి’ సినిమాకి సీక్వెల్‌ తీయాలని ఆలోచనలు చేస్తున్నారు సాయిధరమ్ తేజ్- కిషోర్ తిరుమల.. కళ్యాణి ప్రియదర్శిణి హీరోయిన్‌గా వచ్చిన ‘చిత్రలహరి’ సినిమాలో నివేదా పేతురాజ్ ముఖ్యపాత్రలో నటించింది.

‘సుప్రీం’ తర్వాత వరుసగా ‘తిక్క’, ‘విన్నర్’, ‘నక్షత్రం’, ‘జవాన్’, ‘ఇంటెలిజెంట్’, ‘తేజ్ ఐ లవ్ యూ’ వంటి డిజాస్టర్లు ఫేస్ చేసిన సాయిధరమ్ తేజ్‌కి మంచి కమ్‌బ్యాక్ విజయం..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post