యేసు పుట్టినచోటు క్రిస్‌మస్ వేడుకలు లేవు! బెత్లెహెంలో వేడుకలని కమ్మేసిన..

No Christmas In Bethlehem : యేసు క్రీస్తు పుట్టిన రోజు క్రిస్‌మస్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చిలన్నీ రంగురంగుల కాంతులతో, క్రిస్‌మస్ ట్రీలతో వెలుగులు వెదజిమ్ముతున్నాయి. అయితే యేసు పుట్టిన బెత్లెహంలో మాత్రం క్రిస్‌మస్ కాంతులు కనిపించడం లేదు. దీనికి కారణం పాలస్తీనా-ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధమే.

రిపబ్లిక్ వేడుకలకు హాజరు కానున్న ఫ్రెంచ్ ప్రెసిడెంట్..

క్రిస్‌మస్ వచ్చిందంటే బెత్లెహెం నిండా క్రైస్తవులతో నిండిపోయేది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు, యేసు జన్మదినాన ఆయన జన్మించిన ప్రదేశాన్ని సందర్శించుకోవడానికి వచ్చేవాళ్లు. అయితే పాలస్తీనా- ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో బెత్లెహెం బోసిపోయింది. ప్రస్తుతం బెత్లెహెంలో వెస్ట్ బ్యాంక్, హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ కూడా ప్రస్తుతం ఇజ్రాయిల్ సైన్యం ఆధీనంలో ఉన్నాయి.

చైనాలో భారీ భూకంపం.. 100కి పైగా మృతి..

గాజాలో ఇజ్రాయిల్ మిలిటరీ దాడులతో ఈ ఏడాది యేసు పుట్టిన ప్రాంతంలో, క్రిస్‌మస్ వేడుకలు జరగడం లేదు. ప్రతీయేటా ఈ సమయంలో లక్షల మంది పర్యాటకులతో నిండిపోయే ఈ ప్రదేశంలో కనీసం క్రిస్‌మస్ ట్రీస్‌ కూడా కనిపించడం లేదని క్రైస్తవులు బాధపడుతున్నారు.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post