నిత్యా మీనన్‌తో అలాంటి సీన్ చేయించాలనుకున్న చిత్ర యూనిట్.. హీరోయిన్ చేసిన పనికి..

Nithya Menen : 2011లో విడుదలైన ‘అలా మొదలైంది’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నిత్యా మీనన్. ఆ తర్వాత ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘సత్యాఫ్ సత్యమూర్తి’, ‘జనతా గ్యారేజ్’, ‘అ!’ వంటి మూవీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పాత్ర నచ్చితే, ఎంత చిన్న రోల్ అయినా చేయడానికి ఇష్టపడే నిత్యా మీనన్, ప్రస్తుతం సినిమాలు తక్కువగా, వెబ్ సిరీస్‌లు ఎక్కువగా చేస్తోంది.

త్రిషను రేప్ చేయాలని అనుకున్నా! ‘లియో’ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ షాకింగ్ కామెంట్స్..

‘అలా మొదలైంది’ మూవీ సమయంలో నిత్యా మీనన్‌తో జరిగిన ఓ సంఘటనను తాజాగా బయటపెట్టింది ఆ చిత్ర దర్శకురాలు నందిని రెడ్డి. ‘‘నిత్యా మీనన్‌తో ‘అలా మొదలైంది’ సినిమా చేస్తున్నప్పుడు ఫస్ట్ సీన్‌లోనే డ్రింకింగ్ సీన్ రాసుకున్నా. ఆ సీన్ చాలా బాగా వచ్చింది. దీంతో చిత్ర యూనిట్, అలాంటి మరో సీన్ పెట్టాలని చెప్పారు. నేను దాంతో అవసరం ఏముందని చెప్పినా పట్టించుకోలేదు. పెట్టాల్సిందేనని చెప్పారు.

Nithya Menen

నేను వెళ్లి, నిత్యాతో విషయం చెప్పాను. తను ఒక్కటే మాట చెప్పింది. ఈ సీన్ అవసరం ఏముంది? నిత్యా చేయనని చెప్పిందని చెప్పండి. అని నిర్మొహమాటంగా చెప్పేసింది. అప్పటికే ఆ అమ్మాయి వయసు 21 ఏళ్లు. తెలుగులో మొదటి సినిమా. అయినా తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పిన నిత్యను నేను షాక్ అయ్యా. ఆమె మాటలు నాలో ధైర్యాన్ని నింపాయి. ఎవరి కోసం, దేని కోసం తల వంచకూడదని డిసైడ్ అయ్యా. ఆ కాన్ఫిడెన్స్ నాకు నిత్యానే ఇచ్చింది..’’ అంటూ చెప్పింది నందిని రెడ్డి..

రామ్ చరణ్‌కి జోడిగా సాయి పల్లవి.. కాంబో సెట్ అయ్యిందా, ఫ్యాన్స్‌కి పూనకాలే!

‘అలా మొదలైంది’ మూవీ సక్సెస్ తర్వాత సిద్ధార్థ్‌తో ‘జబర్ధస్త్’ మూవీ చేసిన నందిని రెడ్డి, ‘కళ్యాణ వైభోగమే’, ‘ఓ! బేబీ’, ‘అన్నీ మంచి శకునములే’ వంటి మూవీస్ తీసింది. ఇందులో ‘ఓ! బేబీ’ మూవీ తప్ప మిగిలినవన్నీ మిగిలినవన్నీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post