Lakshmi Parvathi : చంద్రబాబు, జైలులో ఉండే అది నేర్చుకున్నాడు..

Lakshmi Parvathi : ఐదేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. ఐదేళ్లు పాలించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించిన ఏపీ ప్రజలు, తెలుగుదేశం కూటమికి చారిత్రక విజయాన్ని అందించారు. జనసేన 21 స్థానాల్లో పోటి చేస్తే 21 స్థానాల్లోనూ గెలిచింది. వై నాట్ 175 అంటూ 175 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ, మొత్తంగా 11 స్థానాలకే పరిమితమైంది. అయితే ఈ పరాజయాన్ని అస్సలు అంగీకరించలేకపోతున్నారు వైసీపీ నాయకులు.

తాజాగా ఎన్టీ రామారావు రెండో భార్య లక్ష్మీ పార్వతి, చంద్రబాబు నాయుడిపై సంచలన ఆరోపణలు చేసింది.. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుని జైలులో పెట్టించింది. అక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాడు. బయటికి వచ్చి దాన్ని బాగా అమలు చేశాడు. అందుకే జనాలు ఎవరికి వేసినా వాళ్లకే ఓట్లు వెళ్లేలా ట్యాంపరింగ్ చేసి గెలిచారు..’ అంటోంది లక్ష్మీ పార్వతి..

Balakrishna : భువనేశ్వరికి ముద్దు పెట్టిన అన్న.. ‘యానిమల్’ మూవీతో పోలుస్తూ.. వైరల్ అవుతున్న వీడియో..

ఈ వ్యాఖ్యలను తెలుగుదేశం కార్యకర్తలు తిప్పికొడుతున్నారు. చంద్రబాబు కొన్ని రోజుల పాటు జైలులో ఉంటేనే ఈవీఎం ట్యాంపరింగ్ నేర్చుకుంటే 16 నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన వైఎస్ జగన్ ఇంకెన్ని కుట్రలు, స్కామ్‌లు నేర్చుకుని ఉంటాడని, 2019లో వైసీపీ గెలవడానికి ఇదే కారణమా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post