Kalki 2898AD : కల్కి మూవీలో ఎన్టీఆర్ ఫిక్స్.. ఆ చిరంజీవులందరినీ దింపుతున్న నాగ్ అశ్విన్..

Kalki 2898AD : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి 2898AD’ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘కల్కి’ మూవీలో అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పఠానీ నటిస్తున్నారు. వీరితో పాటు ఈ మూవీలో గెస్ట్ రోల్స్ చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.

Guntur Kaaram : గుంటూరు కారం ఫ్లాప్ కి బాధ్యులెవరు..!?

తాజాగా ‘కల్కి’ మూవీలో ఎన్టీఆర్ నటిస్తున్నాడని కూడా దాదాపు కన్ఫార్మ్ అయిపోయింది. ‘కల్కి’ క్లైమాక్స్‌లోభారత ఇతిహాసాల ప్రకారం చిరంజీవులుగా చెప్పబడిన హనుమంతుడు, బలి చక్రవర్తి, అశ్వర్థామ, కృపాచార్యుడు, వేదవ్యాసుడు, పరుశు రాముడు, విభీషణుడు వస్తారని సమాచారం. అశ్వర్థాముడిగా అమితాబ్ బచ్చన్ నటిస్తుంటే, వేద వ్యాస్‌గా దర్శకుడు రాజమౌళి, కృపాచార్యుడిగా నేచురల్ స్టార్ నాని నటిస్తున్నారట. అలాగే పరుశురాముడి పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడని సోషల్ మీడియాలో వార్త తెగ వైరల్ అవుతోంది.

కల్కి క్లైమాక్స్‌లో అవెంజర్స్: The Infinity War స్టైల్‌లో చిరంజీవులంతా కల్కీకి సాయంగా వస్తారని, తెలుగు సినీ స్క్రీన్‌పైనే ఎప్పుడూ చూడని క్లైమాక్స్ ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్‌ టాక్. ఇదే నిజమైతే బాక్సాఫీస్ రికార్డులు షేక్ అవ్వడం పక్కా.

Mahesh Babu Trivikram : ఘాటు సరిపోలేదు..!?

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post