Guntur Kaaram : ఓటీటీలోకి ‘గుంటూర్ కారం 2’ మూవీ..

Guntur Kaaram : ‘గుంటూర్ కారం’ మూవీ మొదలైంది ఓ కథతో, విడుదలైంది మరో కథతో! కథ మారిన తర్వాత సినిమా విడుదలకు మధ్యలో అనేక మార్పులు జరిగాయి. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్దేని సెలక్ట్ చేశారు. సినిమా షూటింగ్‌ కూడా దాదాపు అయిపోవస్తుందని అనుకుంటుండగా హీరోయిన్ మారిపోయింది. పూజా హెగ్దే స్థానంలోకి మీనాక్షి చౌదరి వచ్చింది..

Anant Ambani Wedding Cost : అనంత్ అంబానీ పెళ్లి కోసం అన్ని కోట్లా.. సెలబ్రిటీలంతా అక్కడే..

వాస్తవానికి మీనాక్షి చేసిన మహేష్ మరదలు పాత్ర కోసం శ్రీలీలను అనుకున్నారు. శ్రీలీల పాత్ర కోసం పూజా హెగ్దేని సెలక్ట్ చేశారు. అలాగే షూట్ కూడా చేశారు. అయితే తన పాత్ర కంటే శ్రీలీల పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉందని అలిగిన పూజా, సినిమా నుంచి తప్పుకుందని ప్రచారం జరిగింది. పూజా ఎందుకు పక్కకి తప్పుకుందో తెలీదు కానీ సైడ్ హీరోయిన్‌గా ఉన్న శ్రీలీల, మెయిన్ హీరోయిన్‌గా మారిపోయింది..

వాస్తవానికి తొలుత షూట్ చేసిన కథలో మహేష్ మరదలు పాత్రకు కూడా కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయట. శ్రీలీల గ్లామర్‌‌కి తగ్గట్టుగా ఓ డ్యూయెట్ కూడా రాసుకున్నారట. అయితే హీరోయిన్ మారడంతో ముందు తీసిన డ్యూయెట్‌ని కూడా సినిమాకి వాడేసి, మీనాక్షి చౌదరిని మాత్రం టీలు, కాఫీలు, మందు బాటిల్స్ ఇవ్వడానికి మాత్రమే పరిమితం చేశాడు గురూజీ..

Guntur Kaaram : గుంటూరు కారం ఫ్లాప్ కి బాధ్యులెవరు..!?

సంక్రాంతికి విడుదలైన ‘గుంటూర్ కారం’ తీవ్రమైన ట్రోలింగ్ తట్టుకుని, బాక్సాఫీస్ దగ్గర సెమీ హిట్టుగా నిలిచింది. దీంతో ఓటీటీలో పూజా హెగ్దేతో తీసిన సీన్స్‌ని విడుదల చేయాలని అనుకుంటున్నారట… ‘గుంటూర్ కారం’లో పూజా వర్కింగ్ స్టిల్స్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.. కనీసం పూజా ఉండి ఉంటే, గోడౌన్‌లో ఢీ షో డ్యాన్సులు ఉండేవి కావని ఫీల్ అవుతున్నారు అభిమానులు..

By UshaRani Seetha

I'm Telugu Content writer with 4 years of Experience. I can write any vertical articles but specialist in Movie Articles and Special Stories

Related Post