Animal Movie Trolls : ‘యానిమల్’ మూవీని కార్నర్ చేస్తున్న తమిళులు..

Animal Movie Trolls : సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ మూవీ, డిసెంబర్ 1న విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో నటనకు రణ్‌బీర్ కపూర్, ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా గెలిచాడు. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్థన్ రామేశ్వర్‌, బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరుకి ఫిల్మ్ ఫేర్ దక్కించుకున్నాడు. ఈ మూవీ ఓటీటీలో విడుదలైన తర్వాత కోలీవుడ్ ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది.

ఇలాంటి చెత్త సినిమాలు చేయకు.. బాబీ డియోల్‌ని తిట్టిన తల్లి..

అసభ్యకరమైన సీన్స్‌తో మహిళలను చులకన చేసే విధంగా సన్నివేశాలు ఉన్నాయని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. తమిళ సినీ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా రాధికా శరత్ కుమార్, తదితర సెలబ్రిటీలు కూడా ‘యానిమల్’ మూవీ దారుణంగా ఉందని, ఈ సినిమాలు సమాజానికి హానికరం అనేలా ట్వీట్లు చేస్తున్నారు. ‘యానిమల్’ మూవీ రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.. హీరో అంతలా ఊచకోత కోస్తుంటే, పోలీసులు నిద్రపోతున్నారా? అంటూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు..

అయితే రివ్యూలతో సంబంధం లేకుండా, A సర్టిఫికెట్ తెచ్చుకున్న మూవీకి ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇక్కడ ప్రేక్షకుల తీర్పు కంటే సినిమాకి గొప్ప గౌరవం ఇంకేమీ లేదు. అయితే ఓ తెలుగు డైరెక్టర్‌కి ఇంత గుర్తింపు దక్కడం సహించలేకనే కోలీవుడ్ జనాలు, ఇంతలా రియాక్ట్ అవుతున్నారని అంటున్నారు టాలీవుడ్ జనాలు. వాళ్లు తీసిన ‘పొన్నియన్ సెల్వం’ మూవీ చూడలేక జనాలు, థియేటర్‌లో నిద్రపోయారని కౌంటర్ మీమ్స్ ప్రత్యక్షమవుతున్నాయి. ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో మరోసారి కోలీవుడ్, టాలీవుడ్ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది..

నేను, మీ ఇద్దరి కాళ్లు నాకుతాను!.. ఆర్జీవీ, ‘యానిమల్’ రివ్యూ చదవితే..

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post