Chandrababu Naidu Oath Ceremony : రామ్ చరణ్‌ వచ్చాడు, ఎన్టీఆర్ ఎక్కడ? ఆహ్వానం అందలేదా..

Chandrababu Naidu Oath Ceremony : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకారానికి రాజకీయ ప్రముఖులు అందరూ అతిథులుగా వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో మెగా ఫ్యామిలీ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కాళ్లకు నమస్కరించి, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం తీసుకోగా రామ్ చరణ్, బ్రహ్మాణితో మాట్లాడుతూ కనిపించాడు..

Nandamuri Prince : నందమూరి నాలుగోతరం..?

చంద్రబాబుతో పాటు నందమూరి బాలకృష్ణ కూడా హిందూపురం ఎమ్మెల్యేగా మూడోసారి గెలవడంతో ఈ కార్యక్రమంలో బాలయ్య ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ సభ్యులు కూడా కనిపించారు. అయితే హరికృష్ణ వారసులు కళ్యాణ్‌రామ్, ఎన్టీఆర్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. రామ్ చరణ్ వచ్చాడు సరే, ఎన్టీఆర్ ఎక్కడా అంటూ తారక్ గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

మేనమామ నారా చంద్రబాబు నాయుడు, మేనల్లుడు ఎన్టీఆర్‌కి ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా పిలిచాడని కొందరు అంటుంటే, ఆయనికి ఆహ్వానం అందలేదని మరికొందరు అంటున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ షూటింగ్ కోసం గోవాలో ఉన్నాడు. బుధవారమే గోవా షెడ్యూల్ ముగించుకుని, హైదరాబాద్‌కి తిరిగి వచ్చాడు. షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్లే ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి రాలేదట.. తమ్ముడు ఎన్టీఆర్ రాకపోవడం వల్లే అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా ఈ వేడుకకి దూరంగా ఉండి ఉండవచ్చు..

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post