Viral Video : కశ్మీర్ నుంచి పంజాబ్‌ వరకూ డ్రైవర్ లేకుండానే వెళ్లిన రైలు..

Viral Video : పరోటా కొనుక్కోవడానికి రైలుని పట్టాల మీద ఆపిన దిగిన డ్రైవర్‌కి సంబంధించిన వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియో కారణంగా సదరు లోకో పైలట్‌ ఉద్యోగం కూడా కోల్పోయాడని సమాచారం. తాజాగా ఓ లోకో పైలట్, టీ తాగడానికి స్టేషన్‌లో దిగడంలో రైలు.. ఏకంగా 78 కిలోమీటర్లు డ్రైవర్ లేకుండానే దూసుకెళ్లింది.. కీర్తి సురేష్, ధనుష్ నటించిన ‘రైలు’ సినిమా స్టోరీలా అనిపిస్తున్నా, ఇది నిజం..

Shanmukh Jaswanth : షణ్ముక్ జశ్వంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..

జమ్మూ కశ్మీర్‌లోని కథువా రైల్వే స్టేషన్‌లో‌ గూడ్స్ ట్రైయిన్‌ని ఆపిన లోకో పైలట్, టీ తాగడానికి కిందకి దిగాడు. బ్రేక్ వేయకుండానే కిందకి దిగడం వల్ల కొద్దిసేపటికి మెల్లిగా ముందుకు కదిలిన ఆ గూడ్స్ రైలు, మెల్లిమెల్లిగా వేగం అందుకుని.. పఠాన్ కోట్ రైల్వే ట్రాక్ వాలుగా ఉండడంతో గంటకు 100 కి.మీ.ల వేగంతో పంజాబ్ వైపు దూసుకెళ్లింది. అలా 84 కిలో మీటర్లు ప్రయాణించిన తర్వాత విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు, ఉచ్చి బస్సీ రైల్వే స్టేషన్‌ దగ్గర చెక్క దిమ్మెల సాయంతో దాన్ని ఆపారు.

ఈ సమయంలో ఎదురుగా మరో ట్రైయిన్ వచ్చినా, అదే లైన్‌లో ముందు వేరే ట్రైయిన్ ఉన్నా భారీ ప్రమాదం జరిగి ఉండేది. అదృష్టవశాత్తు ఆ రైల్వే లైన్‌లో ఆ సమయంలో ఏ ట్రైయిన్‌ లేకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బ్రేక్ వేయకుండా రైలుని ట్రాక్ మీద వదిలి వెళ్లిన లోకో పైలట్, కో పైలట్‌పై విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలియచేశారు.

https://x.com/ANI/status/1761613803341426996?s=20

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post