మరోసారి షాకింగ్ కామెంట్స్‌ చేసిన మాధవీలత… ఆ వ్యాఖ్యలు బాలయ్యను ఉద్దేశించేనా..

Actress Madhavi latha Shocking Comments on Balakrishna : మహేష్ ‘అతిథి’ మూవీలో హీరోయిన్ ఫ్రెండ్‌గా కనిపించిన మాధవీలత, రవిబాబు తీసిన ‘నచ్చావులే’ మూవీతో హీరోయిన్‌గా మారింది. నానితో కలిసి ‘స్నేహితుడా’ మూవీ చేసిన మాధవీ లతకు అనుకున్నంతగా ఆఫర్లు రాలేదు. విశాల్ ‘అంబల’ మూవీ (తెలుగులో మగ మహారాజు)తో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినా ఫలితం లేకపోయింది.

నో నట్ నవంబర్.. అసలేంటి NNN! ఆపుకోవడం మంచిదేనా..

కొన్నేళ్ల క్రితం టీఎన్‌ఆర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టింది మాధవీ లత. సినిమా రంగంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బయటపెట్టి, పెద్ద దుమారమే రేపింది. తాజాగా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలతోనే ట్రెండింగ్‌లో నిలిచింది ఈ తెలుగు అమ్మాయి.

Actress Madhavi latha Shocking Comments on Balakrishna

‘ఆదిపురుష్, మొన్న ఓటీటీలో వచ్చాక చూశాక. నేను చూసిన అతి దరిద్రమైన సినిమాల్లో అది ఒకటి. నాకైతే అస్సలు నచ్చలేదు. హిందువులను విడగొట్టడానికి, విద్వేషాలు రెచ్చగొట్టడానికి తీసినట్టుగా ఉంది..

భగవంత్ కేసరి గురించి కూడా విన్నాను. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి బాగా చెప్పారని అన్నారు. అయితే సినిమాల్లో అలా మంచి మాటలు చెప్పేవాళ్లు, బయట కూడా వాటిని ప్రవర్తిస్తే బాగుంటుంది. లేదంటే చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేది… అన్నట్టుగా ఉంటుంది..’ అంటూ కామెంట్లు చేసింది మాధవీ లత..

నాని సరిపోదా శనివారం, ఆ ఫేమస్ నవలకు కాపీనా? టైటిల్‌తో సహా అన్ని లేపేశాడా..!?

ఈ రెండు కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. భగవంత్ కేసరి గురించి చేసిన వ్యాఖ్యలు బాలయ్యను ఉద్దేశించేనా? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉంటే 2018లో బీజేపీలో చేరిన మాధవీలత, గుంటూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయింది.

By రాములమ్మ

I'm Professional movie buff and Analysist. I'm also passionate to write unknown details about Tollywood, Bollywood and Indian Cinema.

Related Post